Wednesday, October 14, 2009

పెత్తనం - మల్లీశ్వరి కథలు

డెట్రాయిట్ లో సాహితి సభలకి వెళ్లి నప్పుడు ఆనంద్ మల్లీశ్వరి గారి కథల పుస్తకం ఇచ్చారు. పుస్తకం చిన్నగానే ఉండటం తో కథ అక్కడే చదవటం మొదలు పెట్టాను. మొదటి కథ పోరాటం చదువుతున్నప్పుడు నాకు తెలిసిన ఒకరి కథ కొంచం ఇంచు మించు గా యిలాగే ఉండటం తో ఆసక్తి కలిగింది. మంచి శైలి. ఈవిడ మీద ఓల్గా గారి ప్రభావం బాగానే ఉన్నట్టు గా ఉంది (ఓల్గా గారి నవలల మీద పరిశీలన చెయ్యడం వాళ్ళ ఏమో మరి ). మిగిలిన స్త్రీ వాద రచయిత్రులకి ఈవిడకి కొంచం మంచి తేడా ఉంది. మిగిలన వాళ్ళలా కాక యివిడ మగవాళ్ళ వైపు కూడా కొంచం ఆలోచిస్తున్నారు అని అనిపించింది. అంతే కాక వర్ణ వివక్ష లాంటి వాటి మీద కూడా బాగా చర్చించారు. ఇది మంచి పరిణామం.

స్త్రీలకి ప్రయాణం లాంటి వాటి వెనుక ఇంత మానసిక సంఘర్షణ ఉంటుందా అని అనిపించింది. మీరే చేసారు అన్న కథ మనం మనకి తెలీకుండా ఎలా అమ్మాయిలని అబ్బాయిలని విడిగా చూస్తున్నామో చెపుతుంది. (అమెరికా లో అమ్మాయిలు అయితే పింక్ కలర్ , అబ్బాయిలు అయితే బ్లూ కలర్ దుస్తులే దొరుకుతాయి. ఒక పక్క ఇద్దరు సమానమే అని ఇంకో పక్క ఈ గోల ఏంటి అని ఎంత చిరాకో నాకు, ఒక రకం గా పింక్ చూస్తె ఎలర్జీ వచ్చే అంతగా ).

ఇంకో మంచి కథ ఊయ(హ) ల మంచం. మన మనసులో కోరికలు ఎలా అణచి వేయబడతాయో దాని వల్ల ఎలా నలిగిపోత్తమో బాగా చెప్పారు. మంచి కథ.

అన్ని మంచి కథలేనా అంటే , కొన్ని సాధారణ కథలు కూడా ఉన్నాయి . వంటాట అను రాజకీయ వంటింటి కథ, మాట్లాడుదాం , పాద బందనం లాంటివి కొంచం సాదా సీదా కథలు లాగే ఉన్నాయి నాకు.

కథనం అన్నింట్లో బాగుంది. కథ మొదలు పెట్టగానే చదివించే గుణం, అనవసర మసాలాలు లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నది మనసుకు ఎక్కే లాగ చెప్పే గుణం అన్ని కథలలో ఉంది.

శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ నిర్వహించిన కథ సంపుటాల పోటీలో బహుమతిగా ఆర్ధిక సహాయం పొందిన పుస్తకం. వారి అమ్మాయి స్నిగ్ద పేరు మిద స్నిగ్ద బుక్స్ అని ప్రచురించారు.

పెత్తనం - మల్లీశ్వరి కథలు వేల నలభై రూపాయలు.

1 comment:

మురళి said...

మల్లీశ్వరి గారి 'రెండంచుల కత్తి' కథ చాలా బాగుంటుందండీ..