Wednesday, October 21, 2009

ఓ గురువారం సాయంత్రం

అమెరికా లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇండియా వెళ్తున్నారు అంటే ముందర మనం ఆలోచించేది వాళ్ళు మనకి ఎం తీసుకెళ్తున్నారు అని. అదే వాళ్ళు వస్తున్నారు అంటే మనకి ఎం తెస్తున్నారు అని. అలాగే పోయిన గురువారం మధు ఇండియా వెళ్తున్నాడు అని తెలిసి గుడిలో ఉండే జయగారు ఏవో ఇస్తా అని అన్నారు. సరే అని మంగళ వారం వెళ్ళాం తెచ్చుకుని పాక్ చెయ్యడానికీ. ఆవిడ మధు గారు మధ్యానం వెళ్ళిపోతారు కదా సాయంత్రం మీటింగ్ ఉంది వెళ్తారా అని అడిగారు. సాయంకాలాలు మనకి పని పాట ఎం ఉండదు కదా సరే అని చెప్పా. ఎం మీటింగ్ లాంటి వివరాలు కూడా ఎం అడగలేదు. ఆ సంగతి అప్పుడే మర్చిపోయాను.

గురువారం సాయంకాలం సాయి గారు కాల్ చేసి గుడికి వస్తున్నారా అని అన్నారు. గుడికే కదా అని చిరిగిన జీన్స్ , రెగ్యులర్ గా వేసే టి షర్టు , చెప్పులు వేసుకుని సాయి గారి కోసం ఎదురుచూడటం మొదలు పెట్టాను. సాయి గారు మాములుగా గుడికి పంచె కట్టుకుని వస్తారు. కాని ఈ రోజు మంచి ఆఫీసు డ్రెస్ లో వచ్చారు అప్పుడు సందేహం వచ్చింది ... డ్రెస్ మార్చుకోవాలా అని అడిగితె , మారిస్తే బెటర్ అని అన్నారు. ఎం మీటింగ్ అంటే , ఎస్ ఎం యు లో టర్కీ దేశస్తులు అన్ని దేశస్థులతో ఒక స్నేహేపురిత డిన్నర్ అని చెప్పారు. మన దగ్గర ఫార్మల్స్ లేవు , అన్ని జీన్స్ తప్ప. సరే అని వేరే జీన్స్ కు మరి , ఇంకో ఫార్మల్ చొక్కా వేసుకుని , షూ వేసుకుని బయలుదేరాను. గుడి లో పూజారి గారి అబ్బాయిలు ఇద్దరినీ పిక్ అప్ చేసుకునే మీటింగ్ జరిగే చోటికి బయలుదేరాం.

మీటింగ్ కాడ ఎక్కువగానే ఉన్నారు జనాలు. వెళ్ళగానే అందరికి నేమ్ టాగ్స్ ఇచ్చారు. దానితో పాటు ఒక రంగు కాగితం ఇచ్చారు. నా కిచ్చిన రంగు కాగితం ఆకు పచ్చ. మా నలుగురికి సీట్లు నాలుగు వేరు వేరు టేబల్ లో ఇచ్చారు. ఒకో టేబల్ మిద ఎనిమిది మంది కి కూర్చునే వీలు ఉంది. మా టేబల్ మిద నేను వెళ్ళే అప్పటికి ఒక టర్కీ దేశస్థుల జంట, ఒక అఫ్రికాన్ అమ్మాయి కుర్చుని ఉన్నారు. నేను దగ్గరకి వెళ్ళగానే అతను నవ్వుతూ లేచి ఎదురు వచ్చి పరిచయం చేసుకున్నారు. తన పేరు ముస్తఫా , ఇక్కడ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు . ఏడో తరగతి పిల్లలకి కంప్యూటర్ క్లాస్సులు చెపుతాను అని చెప్పారు.

నన్ను పరిచయం చేసుకున్నాను. ఆఫ్రికా అమ్మాయి పక్కన ఇంకో ఇద్దరు వచ్చి కూర్చున్నారు. ఈ లోపల సమావేశం మొదలు పెట్టిన సూచనగా డయాస్ మిద ఒక అతను వచ్చి ప్రారంభ ఉపన్యాసం మొదలు పెట్టాడు. ఇది మొదలు పెట్టి పది సంవత్సరాలు అయ్యింది అని చెప్పారు. ఎక్కువగా టర్కీ వాళ్ళే కనపడ్డారు. వారి తరవాత ఇక్కడ వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చిన అమెరికన్స్ ఉన్నారు ఇండియాన్స్ మేము నలుగురు కాకా ఇంకో ఇద్దరు కనపడ్డారు. దాదాపు గా అందరూ సూట్ వేసుకునే ఉన్నారు, మేము తప్ప.

మా టేబల్ మిద ఎనిమిది మంది కూర్చో వచ్చు అని చెప్పా కదా. ఒకో కుర్చీ దగ్గర మేము వెళ్ళే అప్పటికే ఒక ప్లేట్ నిండా సలాడ్ (కుకుంబర్, లేక్టిస్ వగైరాలతో చేసినది ) పెట్టి ఉంది. మంచి నీళ్ళు కాని , ఐస్ టీ కాని సర్వ్ చేస్తున్నారు తాగాడానికి. ఇంకో ప్లేట్ లో రెండు రకల టర్కీ స్వీట్స్, ఒక చిన్న బుట్ట లో టర్కీ రొట్టెలు రొట్టెలు ముందర ఒక క్రీం లాంటిది ఉంది ... అది విడిగా కూడా తినవచ్చు అని తర్వాత తెలిసింది.

ఉపన్యాసాలు వింటూ సలాడ్ తినడం మొదలు పెట్టాం. మధ్య మధ్య లో ముస్తఫా టర్కీ గురించి చెపుతూ నేను భారత దేశం గురించి చెపుతూ సలాడ్ ముగించాం. ఉపన్యాసాలు (అందరు అమెరికన్స్ ) ఇచ్చే వారు అందరు దాదాపు గా టర్కీ ని సందర్శించారు. అక్కడి వారి పద్దతులు, అక్కడి వారి స్నేహపూరిత వాతావరణం గురించి ఎక్కువ గా మాట్లాడారు . ఉపన్యాసకుడిని పరిచయం చేసే అప్పుడు, ఒక్కొక్కళ్ళ పేరు వెనుక బోలెడు డిగ్రీలు చెప్పారు. వీళ్ళకి చాలా ఓపిక అంత చదవటానికి అని అనుకున్నా (మనం ఏమో విన్నది రాయడానికే బద్ధకం కదా మరి ).

ముగ్గురి వుపన్యాసం అయ్యాక డిన్నర్ మొదలు పెట్టడానికి ముందర , ఒక ప్రకటన చేసారు. ప్రతి ఒక్కరు వేరే టేబల్ దగ్గరకి వెళ్లి కొత్తగా ఇంకో ముగ్గురిని కొత్తగా పరిచయం చేసుకోవాలని చెప్పారు. నేను నా టేబల్ మిద ఉన్నవాళ్ళనె పూర్తిగా పరిచయం చేసుకోలేదు అని ముందర ఆ ఆఫ్రికా అమ్మాయి కనపడగానే పరిచయం చేసుకున్నా. ఆవిడ ఆఫ్రికా లో ఒక చిన్న దేశం నుంచి వచ్చారు అని చెప్పారు. ఆవిడ పక్కన ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఉన్న పక్కన దేశం లో నుంచి వచ్చారు. నేను వీళ్ళతో మాట్లాడుతూ ఉండగానే అనిల్, సునీల్ (పూజారి గారి పిల్లలు ) వచ్చారు. నేను వాళ్ళని పరిచయం చేసి మాట్లాడుతూ ఉండగా , ఇంకో ముగ్గురు పరిచయం చేసుకున్నారు. అంత బిన్న దేశాలకి చెందినవారే. ఇలా ఒక అయిదు నిమషాలలో దాదాపు కొత్తగా ఒక ఎనిమిది మంది కలిసారు.

మళ్ళా ఒక ప్రకటన , డిన్నర్ కి అందరు కూర్చోవాలని.. అప్పుడు నాకు ఇచ్చిన కాగితం అకుపచ్చది టేబల్ మిద పెట్టినట్టు గుర్తు వచ్చింది. నా పక్కన ఉన్న ముస్తఫా ఎదురుగా గిలబి రంగు కాగితం, వాళ్ళ పక్క వాళ్ళ దగ్గర ఎర్ర కాగితాలు గమనించాను. అవి మేము తినే ఆహారం గురించి సర్వర్ కి తెలియడానికి ఇచ్చిన కాగితాలు అని అర్ధం అయింది. నాది శాఖాహారం, పింక్ ఉంటె చేపలు, ఎర్ర రంగు కి కోడి మాంసము ఇలా వివిధ రంగులకి వివిధ రకాల భోజనం. నాకు శాఖాహారం లో సమోసా లాంటిది ఒక మూడు పెట్టారు దాంట్లో లైట్ గా పాల కూర పెట్టారు (మనకి ఎక్కువగా ఆలుగడ్డ మసాల పెడతారు కదా ). కొంచం బ్రోకల్లి , కొంచం వేయించిన బీన్సు , వేయించిన అన్నం కొంచం లావుగా ఉన్నది పెట్టారు. మనకి ఆ అన్నం సయించలేదు కాని ఒక సమోసా లాంటింది తిని ఆ బ్రోకేల్లి , బీన్సు తిని సరిపుచ్చు కున్నా.

స్వీట్స్ మనకి మిడిల్ ఈస్ట్ షాప్స్ లో కూడా దొరకుతాయి , వాటిని dry గా తెచ్చి వాటి మీద గోరువెచ్చని పంచదార పాకం వేస్తె చాలా బాగుంటుంది అని ముస్తఫా భార్య చెప్పారు. మేము భోజనం ముగించే సమయానికి మళ్ళా ఉపన్యాసాలు మొదలు పెట్టారు. ఇంకో ముగ్గురు అయ్యాక ఇక్కడి మేయర్ వచ్చి ఉపన్యాసం మొదలు పెట్టారు. అయన చెప్పిన దానిప్రకారం తొంభైల మొదట్లో ఇక్కడ తెల్ల వాళ్ళే ఎక్కువ గా ఉండేవారు (తొంభై శాతం ) ఇప్పుడు తెల్లవాళ్ళ సంఖ్య అరవై అయిదు కి వచ్చింది. మిగిలిన ముప్పై అయిదు శాతం లో ఇరవై శాతం వరకు మన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు అని చెప్పారు . ఈ పద్దెనిమిది ఏళ్లలో చాలా పెరిగింది మన సంఖ్య అని అర్ధం అయ్యింది.

సమావేశం ముగిసే సరికి కొంచం ఏదోలా అనిపించింది. అప్పుడే అయ్యి పోయిందా అన్న భావన. అక్కడ సాయి గారి టేబల్ లోఒక టర్కీ కి చెందిన మెడికో కుర్చుని ఉంది. ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం. తనకి అక్కడ చదువుకునే అవకాసం లేక ఇక్కడకి వచ్చి చదువుకుంటోంది (టర్కీ లో అమ్మాయిలు జుట్టు కనపడకుండా తల మొత్తం ఒక వస్త్రం కప్పుకుంటారు. అమ్మాయిలు, కాని University లొ చదివె అమ్మాయిలు అలా కప్పుకుంటె వారికి University లో చదివె అవకాశం లేదు అలా అని కప్పుకొక పొతే వారు వారి మతానికి అపచారం చెసిన వారు అవుతారు . అందువల్ల వారికి అక్కడ చదివె అవకశం లేదు ) ఎంత బాధొ వింటుంటె నె, అలాంటిది అనుభవించాలి అంటె ఒక్క సారి అలొచించండి.) మన దేశం ఎంత గొప్పదొ అని అనిపిచదం లొ తప్పు లెదు. అక్కద నుంచి బైటకి వచ్చాక కొంతమంది కొత్త స్నెహితులని కలిసిన అనుభుతితొ యింటికి చెరుకున్నా.

2 comments:

మురళి said...

బాగున్నాయి మీ అనుభవాలు.. నిజమే వేరే ప్రాంతం వాళ్ళని కలవడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి..

sunita said...

బాగున్నాయి మీ అనుభవాలు.